జాతీయస్థాయిలో రాణించాలి : ఎంపీ ఉత్తమ్‌

ABN , First Publish Date - 2022-09-19T06:03:56+05:30 IST

గ్రామీణ క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా చెస్‌ అసో సియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్‌-15 ఓపెన్‌ టు ఆల్‌ పోటీలను ఆయ న ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో భారతదేశం క్రీడల్లో అగ్రస్థానంలో ఉందన్నా రు.

జాతీయస్థాయిలో రాణించాలి : ఎంపీ ఉత్తమ్‌
మేకల అభినవ్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎంపీ

కోదాడ, సెప్టెంబరు 18: గ్రామీణ క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా చెస్‌ అసో సియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్‌-15 ఓపెన్‌ టు ఆల్‌ పోటీలను ఆయ న ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో భారతదేశం క్రీడల్లో అగ్రస్థానంలో ఉందన్నా రు. గ్రామీణస్థాయి క్రీడాకారులు చెస్‌ క్రీడల్లో రాణించి జాతీయస్థాయికి ఎదగాలన్నారు. కోదాడ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన చెస్‌ చిచ్చర పిడుగు అభినవ్‌ ఆశయా లు సాధించాలన్నారు. అనంతరం అభినవ్‌ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించా రు. కార్యక్రమంలో రేవూరి వెంకటాచారి, పారుపల్లి చంద్రశేఖర్‌, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌ లక్ష్మీనారాయణరెడ్డి, వంగవీటి రామారావు, గంధం యాదగిరి, కందుల కోటేశ్వరరావు, ఆవుదొడ్డి ధనమూర్తి, బాగ్దాద్‌, రంగారావు, శోభన్‌, రజని, నర్సింహ పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-19T06:03:56+05:30 IST