భక్తి శ్రద్ధలతో మాతం ప్రదర్శన
ABN , First Publish Date - 2022-09-16T05:10:58+05:30 IST
షియా ముస్లిం సంఘం ఆధ్వర్యంలో భువనగిరిలో గురువారం భక్తిశ్రద్ధలతో మాతం ప్రదర్శన కొనసాగింది.
భువనగిరి టౌన్, సెప్టెంబరు 15: షియా ముస్లిం సంఘం ఆధ్వర్యంలో భువనగిరిలో గురువారం భక్తిశ్రద్ధలతో మాతం ప్రదర్శన కొనసాగింది. మహ్మద్ ప్రవక్త మనుమడు హిమాం హుస్సేన్తో పాటు 72మంది కుటుంబ సభ్యులు, అనుచరులు అర్బయాన్ (40 రోజుల సంతాప దినాలు )ను పురస్కరించుకొని మాతం ప్రదర్శన నిర్వహించారు. అమరులను స్మరిస్తూ భక్తి గేయాలు ఆలపిస్తూ ప్రదర్శన కొనసాగింది. షియా వర్గానికి చెందిన మహిళలు, పురుషులు నల్లటి దుస్తులు ధరించి ప్రదర్శనలో పాల్గొన్నారు. మహ్మద్ ప్రవక్త మనుమడి ప్రాణత్యాగ ప్రాధాన్యాన్ని మత పెద్దలు ఈ సందర్భంగా వివరించారు. స్థానిక ఖిల్లా నగర్, పీర్ల చావిడి నుంచి బీబీకా అలవా అషుర్ఖానా వరకు ప్రదర్శన కొనసాగింది. కార్యక్రమంలో షియా ముస్లిం సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రజా హుస్సేన్ కాలేబ్ హుస్సేన్, చున్నూబాయ్, హైదర్ అలీ, రషీద్, లాయక్ అలీ, బాసిత్, ఇంతియాజ్, ఆబేది, తదితరులు పాల్గొన్నారు.
