గడువులోగా పీఎంఈకేవైసీ పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-05-24T06:33:33+05:30 IST
ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఈ నెల 31 నాటికి రైతులు తమ ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన(పీఎంఈకేవైసీ) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసా
జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత
కేతేపల్లి, మే 23: ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఈ నెల 31 నాటికి రైతులు తమ ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన(పీఎంఈకేవైసీ) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత సూచించారు. కేతేపల్లిలోని మీ-సేవా కేంద్రంలో నిర్వహిస్తున్న పీఎంఈకేవైసీ ప్రక్రియను ఆమె సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో పీఎంకిసాన్ లబ్ధిదారులు విధిగా ఈకేవైసీ ద్వారా తమ ఆధార్కార్డు, ఫోన్నెంబర్తో అనుసంధానం చేయించుకోవాలని కోరారు. పీఎంఈకేవైసీ చేయించని వారికి పీఎంకిసాన్ ఆర్థిక సాయం అందే అవకాశం లేదన్నారు. అనంతరం ఆమె స్థానికంగా ఉన్న ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేశారు. ఆయా దుకాణాల్లో నిల్వలను పరిశీలించి, మాట్లాడుతూ వ్యాపారులు నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయాలను తమ దృష్టికి తీసుకువస్తే చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఆమె వెంట కేతేపల్లి వ్యవసాయ అధికారి పురుషోత్తం, ఏఈవోలు బాలరాజు, వీరేశ్ తదితరులు ఉన్నారు.