మరుగుదొడ్ల బిల్లులు చెల్లించాలి
ABN , First Publish Date - 2022-05-25T06:05:46+05:30 IST
మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు చెల్లించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని జెర్రిపోతులగూడెంలో గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట 50 మంది లబ్ధిదారులు మంగళవారం ధర్నా చేశారు.
చిలుకూరు, మే 24 : మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు చెల్లించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని జెర్రిపోతులగూడెంలో గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట 50 మంది లబ్ధిదారులు మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లు నిర్మించుకున్నామని, నేటికీ బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. మరుగుదొడ్ల బిల్లుల కోసం ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే అందేలా ఏర్పాటు చేస్తానని గ్రామస్థులకు పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. సుమారు అరగంటకు పైగా ఆందోళన నిర్వహించారు.