వెంటనే పరిహారం చెల్లించాలి
ABN , First Publish Date - 2022-05-26T06:38:06+05:30 IST
రిజర్వాయర్ కారణంగా భూములు కోల్పోయిన తమకు వెంట నే పరిహారం చెల్లించాలని చర్లగూడెం నిర్వాసితులు డిమాండ్చేశారు.
చర్లగూడెం నిర్వాసితుల ధర్నా
మర్రిగూడ, మే 25: రిజర్వాయర్ కారణంగా భూములు కోల్పోయిన తమకు వెంట నే పరిహారం చెల్లించాలని చర్లగూడెం నిర్వాసితులు డిమాండ్చేశారు. రిజర్వాయర్ క్యాంపు కార్యాలయం వద్ద నిర్వాసితులు చేపట్టిన ధర్నా బుధవారానికి 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ, వారం రోజుల్లో పరిహారం ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినా నేటికీ పరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 16రోజుల నుంచి ధర్నా చేస్తున్నా అధికారులకు పట్టించుకోవడం లేదన్నారు. నిర్వాసితులకు పూర్తి పరిహారం, పునరావాసం, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాకే రిజర్వాయర్ పనులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.ధర్నాలో చర్లగూడెం ముంపు బాధితులు పలువురు పాల్గొన్నారు.