యజమాని తిట్టాడని పాలేరు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-12-23T00:16:08+05:30 IST

యజమాని తిట్టాడని మనస్తాపం చెందిన పాలేరు ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహ త్యాయత్నం చేశాడు.

యజమాని తిట్టాడని పాలేరు ఆత్మహత్యాయత్నం

తట్టుకోలేక పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న పాలేరు

పెళ్లికి వెళ్లాడని యజమాని దాడిచేశాడని బంధువుల ఆరోపణ

సూర్యాపేటరూరల్‌, డిసెంబరు 22: యజమాని తిట్టాడని మనస్తాపం చెందిన పాలేరు ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహ త్యాయత్నం చేశాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా సూర్యాపేట మునిసి పాలిటీ పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో బుధవారం జరిగింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మునిసిపాలిటీ పరిఽధిలోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన లంజపెల్లి శ్రీరాములు అదే గ్రామానికి చెందిన గవ్వ ధర్మారెడ్డి వద్ద పది సంవత్సరాలుగా పాలేరుగా పనిచేస్తున్నాడు. శ్రీరాములు భార్య ఐదు సంవత్సరాల క్రితం చనిపోయింది. కొడుకులు లేకపోవడంతో యజమాని ఇచ్చిన కొట్టంలోనే జీవనం సాగి స్తున్నాడు. ఈ నెల 18న శ్రీరాములు వాళ్ల కులస్థుల పెళ్లికి వెళ్లాడు. ‘నువ్వు నాకు జీతం ఉండి పెళ్లికి ఎలా వెళ్తావు’ అని కులం పేరుతో దూషిస్తూ కర్రతో దాడి చేసి మూడు రోజుల పాటు చిత్ర హింసలకు గురి చేశాడని శ్రీరాములు బంధువులు ఆరోపించారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక శ్రీరాములు బుధవారం తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడని బంధువులు ఆరోపించారు. గ్రామంలో ఉన్న శ్రీరాములు బంధువుల ఇంటికి వెళ్లిన ధర్మారెడ్డి ‘మీ బావ పెట్రోల్‌ పోసుకుని తగులబడ్డాడు.. తీసుకుపోండి’ అని చెప్పడంతో బంధువులు వెం టనే వెళ్లి శ్రీరాములును సూర్యాపేట ఏరియా ఆసుపత్రి తరలించారు. ప్రస్తు తం శ్రీరాములు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యజమాని తిట్టడం, కర్రతో దాడి చేయడంతోనే శ్రీరాములు ఆత్మహత్యాయత్నం చేసు కున్నాడని బందువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై రూరల్‌ ఎస్‌ఐను వివరణ అడగగా పెట్రోల్‌ పోసుకున్న విషయం తెలిసిందని, ఇంకా ఫిర్యాదు అందలేదని తెలిపారు.

Updated Date - 2022-12-23T00:16:09+05:30 IST