పీఏసీఎస్‌ చైర్మన్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా మురళి

ABN , First Publish Date - 2022-01-13T07:01:22+05:30 IST

నల్లగొండ, జనవరి 12 : ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాథమిక సహకార సం ఘాల (పీఏసీఎస్‌) కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో ఈ కార్యవర్గం ఎన్నికైంది. ఉమ్మడి నల్లగొం డ జిల్లా పీఏసీఎస్‌ చైర్మన్ల సంఘం అధ్యక్షుడిగా తాలూరి మురళీ, ఉపాధ్యక్షులుగా ఆవుల రామారావు, జెర్రిపోతుల రాములుగౌడ్‌, పరమేశ్వర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా గుంటుక వెంకట్‌రెడ్డి, కార్యదర్శులుగా అన్నెం శౌరిరెడ్డి, నలగాని శ్రీనివా్‌సరా

పీఏసీఎస్‌ చైర్మన్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా మురళి
నూతన కార్యవర్గాన్ని అభినందిస్తున్న పీఏసీఎస్‌ చైర్మన్లు

నల్లగొండ, జనవరి 12 : ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాథమిక సహకార సం ఘాల (పీఏసీఎస్‌) కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో ఈ కార్యవర్గం ఎన్నికైంది. ఉమ్మడి నల్లగొం డ జిల్లా పీఏసీఎస్‌ చైర్మన్ల సంఘం అధ్యక్షుడిగా తాలూరి మురళీ, ఉపాధ్యక్షులుగా ఆవుల రామారావు, జెర్రిపోతుల రాములుగౌడ్‌, పరమేశ్వర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా గుంటుక వెంకట్‌రెడ్డి, కార్యదర్శులుగా అన్నెం శౌరిరెడ్డి, నలగాని శ్రీనివా్‌సరావు, వల్లపురెడ్డి ఎల్లంగురి, గట్టుపల్లి నర్సిరెడ్డి ఎన్నికయ్యారు. అదేవిధంగా నియోజకవర్గ ఇన్‌చార్జులుగా ఆలకుంట్ల నాగరత్నంరాజు, పల్‌రెడ్డి మహేందర్‌రెడ్డి, జిక్కిడి జంగారెడ్డి, మాధవరం శ్రీనివా్‌సరావు, ఆవుల వెం కన్న, కన్నెకంటి వెంకన్న, కందిబండి సత్యనారాయణ, వెలిశెట్టి రామకృష్ణ, వీరంరెడ్డి శంభిరెడ్డి, సలహాదారులుగా వంగాల సహదేవరెడ్డి, కనిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, దొంగరి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన సమావేశంలో నూతన అధ్యక్షుడు మురళీ మాట్లాడుతూ తమకు కేవలం రూ.1250 మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారని, సొసైటీల అభివృద్ధికి కృషి చేస్తున్న తమకు నెలకు రూ.25వేలు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా వెహికిల్‌ అలవెన్స్‌ కింద రూ.15వేలు చెల్లించాలని కోరారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెలలో లేదా వచ్చే నెలలో ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-01-13T07:01:22+05:30 IST