వృత్తి పరిరక్షణకోసం ఉద్యమించాలి
ABN , First Publish Date - 2022-08-12T06:05:46+05:30 IST
చేనేత కార్మికుల హక్కుల కోసం, వృత్తి పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకట నర్సు పిలుపునిచ్చారు.
భువనగిరి రూరల్, ఆగస్టు 11: చేనేత కార్మికుల హక్కుల కోసం, వృత్తి పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకట నర్సు పిలుపునిచ్చారు. భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల కోసం ఇంటింటా ఎగురవేసే మువ్వన్నెల జెండాలను చైనా నుంచి దిగుమతికి అనుమతించి దేశంలో చేనేత పరిశ్రమ ప్రతిష్టను దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో చేనేత కార్మిక సంఘం నాయకులు జెల్ల నాంరెడ్డి, వి.లక్ష్మణ్, జె.సత్యనారాయణ, ఉన్నారు.