‘మీలా’ సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2022-06-26T06:35:03+05:30 IST

పారిశ్రామిక రంగంలో సుధాకర్‌ పీవీసీ వ్యవస్థాపకుడు మీలా సత్యనారాయణ సేవలు మరువలేనివని సుధాకర్‌ పీవీ సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మీలా మహాదేవ్‌ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో మీలా సత్యనారాయణ మూడో వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూల మాల లు వేసి నివాళులర్పించి మాట్లాడారు.

‘మీలా’ సేవలు మరువలేనివి
మీలా సత్యనారాయణ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్న ఉద్యోగులు

పారిశ్రామిక రంగంలో ఆయన కృషి విస్తృతమైంది 


సూర్యాపేటటౌన్‌, జూన్‌ 25: పారిశ్రామిక రంగంలో సుధాకర్‌ పీవీసీ వ్యవస్థాపకుడు మీలా సత్యనారాయణ సేవలు మరువలేనివని సుధాకర్‌ పీవీ సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మీలా మహాదేవ్‌ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో మీలా సత్యనారాయణ మూడో వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూల మాల లు వేసి నివాళులర్పించి మాట్లాడారు. వేలాదిమంది కార్మికులకు ఉపాధి కల్పి స్తూ దేశంలోనే సుధాకర్‌ పీవీసీకి ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహానీయుడు సత్యనారాయణ అని కొనియాడారు. మీలా సత్యనారాయణ స్ఫూర్తిని కొనసాగిస్తూ సుధాకర్‌ పీవీసీని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. పారిశ్రామిక రంగంలో ఆయన కృషి విస్తృతమైందని, సామాజిక, రాజకీయ, సేవా రంగాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారన్నారు. కార్యక్రమంలో సుధాకర్‌ పీవీసీ ఉద్యోగులు, కార్మికులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T06:35:03+05:30 IST