‘విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించాలి’

ABN , First Publish Date - 2022-08-11T06:12:18+05:30 IST

విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను పెంపొం దించాలని రాష్ట్ర రిసోర్స్‌ గ్రూప్‌ పర్సన్‌ సైదిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల వనరుల కేంద్రంలో మండల స్థాయి ఉపాధ్యాయుల శిక్షణ తొలిమెట్టు మూడో విడత కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు.

‘విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించాలి’

గరిడేపల్లి, ఆగస్టు 10: విద్యార్థుల్లో  కనీస సామర్థ్యాలను పెంపొం దించాలని  రాష్ట్ర రిసోర్స్‌ గ్రూప్‌ పర్సన్‌ సైదిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల వనరుల కేంద్రంలో మండల స్థాయి ఉపాధ్యాయుల శిక్షణ తొలిమెట్టు మూడో విడత కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. కరోనా తర్వాత విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను సరిచేయడానికి ఈ తొలిమెట్టు కార్యక్రమం ఎంతో ఉప యోగపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని సానుకూల దృక్పథంతో సద్వినియోగం చేసుకుని విద్యార్థులు  కనీస అభ్యాసన ఫలితాలను సాధించాలని ఆయన కోరారు.  కార్యక్రమంలో ఎంఈవో ఛత్రునాయక్‌, కోర్స్‌ డైరక్టర్‌ పి.సత్యనారాయణరెడ్డి, గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, రిసోర్స్‌ పర్సన్‌లు దయాకర్‌, రవీందర్‌, పాపయ్య, సైదులు, మండల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-08-11T06:12:18+05:30 IST