తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలు
ABN , First Publish Date - 2022-06-26T06:32:39+05:30 IST
తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీ వ్ర గాయాలయ్యాయి.
మునుగోడు రూరల్, జూన 25: తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీ వ్ర గాయాలయ్యాయి. ఈ శుక్రవారం రాత్రి మండలంలోని పులిపల్పుల గ్రామంలో చో టుచేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన అనంతుల సాలయ్యగౌడ్ శుక్రవారం సాయంత్రం అదే గ్రామంలోని దోటి కోటేష్ వ్యవసాయ భూమిలోని తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా కాలు జారి కిందపడిపోయాడు. దీంతో ఆయన ఎడమకాలు విరగడంతో పాటు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి కోటే్షను తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.