బుజిలాపురం చెరువులో చేపల మృత్యువాత

ABN , First Publish Date - 2022-06-09T06:12:06+05:30 IST

మునిసిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామ చెరువులో వారం రోజులుగా చేపలు చనిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రా మ ప్రజలు ఆరోపిస్తున్నారు.

బుజిలాపురం చెరువులో చేపల మృత్యువాత

మోత్కూరు, జూన 8: మునిసిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామ చెరువులో వారం రోజులుగా చేపలు చనిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రా మ ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువులో నీరు బాగా తగ్గడం, ఎండల వేడి ఎక్కు వగా ఉండడం చేపలు మృతిచెందడానికి కారణంగా పలువురు భావిస్తున్నారు. గ్రామంలోకి వెళ్లడానికి చెరువు కట్ట పైనుంచే వెళ్లాలి.  చెరువులో చేపలు చనిపోయి భరించలేనంత దుర్గందం వెదజల్లుతుండటంతో కట్టపైనుంచి గ్రామంలోకి వెళ్లలేక పోతున్నామని గ్రామ మాజీ ఉపసర్పంచ మడూరు యాదిరెడ్డితో పాటు పలువురు పేర్కొన్నారు. చచ్చిన చేపలను చెరువునుంచి తొలగించాలని కోరారు.


Updated Date - 2022-06-09T06:12:06+05:30 IST