మేదరి కులస్థుల సమస్యల పరిష్కారికి కృషి : చిరుమర్తి
ABN , First Publish Date - 2022-09-19T06:06:19+05:30 IST
రాష్ట్రంలో ఉన్న మేదరి కులస్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు.
చండూరు, సెప్టెంబరు 18: రాష్ట్రంలో ఉన్న మేదరి కులస్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు. ఆదివారం ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా మేదరి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చండూరులో నిర్వహించి న నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడా రు. మేదరి కులస్థులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. మేదరి కులస్థులను బీసీ-ఏ నుంచి ఎస్టీ జాబితాలో చేర్చే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. మేదరి కులస్థు ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ కుల, మతాల మధ్యన విద్వేశాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తోందని ఆరోపించారు. వారికి రానున్న ఉపఎన్నికలో తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మేదరి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జొర్రీగల శ్రీనివాస్, మునిసిపల్ చైర్పర్సన తోకల చంద్రకళవెంకన్న, కౌన్సిలర్ కోడి వెంకన్న, నాయకులు నోముల రవి, నరేందర్, గణేష్, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, వెంకన్న పాల్గొన్నారు.