వైఎస్సార్‌టీపీ బలోపేతానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-05-26T06:16:51+05:30 IST

గ్రామస్థాయి నుంచి వైఎస్సాఆర్‌ తెలంగాణ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జిల్లేపల్లి వెంకటేశ్వర్లు

వైఎస్సార్‌టీపీ బలోపేతానికి కృషి చేయాలి
నియామకపత్రాలు అందజేస్తున్న జిల్లేపల్లి వెంకటేశ్వర్లు

సూర్యాపేటటౌన్‌, మే 25: గ్రామస్థాయి నుంచి వైఎస్సాఆర్‌ తెలంగాణ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జిల్లేపల్లి వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జూన్‌ 1వ తేదీ నుంచి గడపగడపకు వైఎస్సార్‌టీపీ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి పాదయాత్రను పునఃప్రారంభిస్తారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సాఆర్‌ సంక్షేమ పాలనే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండాగా ప్రజల్లోకి వెళ్తామన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల్లో పూర్తి అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం వైఎస్సార్‌టీపీ మాత్రమేనని చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నికల సమయం కన్నా చాలారోజుల ముందే తుంగతుర్తి అభ్యర్థిని ప్రకటించడం గొప్ప విషయమన్నారు. నేడు పద్మవాలీ భవన్‌లో జరిగే నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం తుంగతుర్తి, కోదాడ మండల అధ్యక్షులకు నియామకపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు పిట్టా రాంరెడ్డి, ఏపూరి సోమన్న, నాయకులు పచ్చిపాల వేణు, రాములు, భాస్కర్‌, రవి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T06:16:51+05:30 IST