మునుగోడు అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం

ABN , First Publish Date - 2022-10-28T01:20:48+05:30 IST

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతోనే సాధ్యమని విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మం డలం లక్ష్మణాపురం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకు లు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో గురువారం టీఆర్‌ఎ్‌సలో చేరారు.

మునుగోడు అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం

విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి

నల్లగొండ జిల్లా నాంపల్లిలో టీఆర్‌ఎస్‌ పార్టీలో పలువురి చేరిక

దేవరకొండ, అక్టోబరు 27: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతోనే సాధ్యమని విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మం డలం లక్ష్మణాపురం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకు లు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో గురువారం టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీ్‌షరెడ్డి మాట్లాడుతూ ము నుగోడు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కేంద్రప్రభుత్వం గ్యాస్‌ ధరలను విఫరీతంగా పెంచుతుండటంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం వచ్చే బీజేపీ నేతలను గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఎందుకు పెంచారో నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలు అభివృద్ధి చెందాయని, మునుగోడు నియోజకవర్గంలో ప్లోరైడ్‌ సమస్యను మిషన్‌భగీరథ ద్వారా పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌, నాంపల్లి మండల రైతుబంధు అధ్యక్షుడు ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, నాయకులు రమేష్‌, నగేష్‌, అంజయ్య, మామిడి వెంకటయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-10-28T01:20:52+05:30 IST