మఠంపల్లి వాసి కృష్ణానాయక్కు డీన్ అవార్డు
ABN , First Publish Date - 2022-01-23T05:39:23+05:30 IST
మండలంలోని కృష్ణతండాకు చెందిన భూక్య కృష్ణానాయక్కు ఉస్మానియా యూనివర్సిటీ న్యాయశాస్త్ర విభాగం డీన్-22 అవార్డును అందజేసింది.
మఠంపల్లి, జనవరి 22 : మండలంలోని కృష్ణతండాకు చెందిన భూక్య కృష్ణానాయక్కు ఉస్మానియా యూనివర్సిటీ న్యాయశాస్త్ర విభాగం డీన్-22 అవార్డును అందజేసింది. నేషనల్ స్కాలర్స్ డేను పురస్కరించుకుని హైదరాబాద్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్ర అందజేశారు. కృష్ణానాయక్కు అవార్డు రావడంపై పలువురు నాయకులు, అధికారులు, తండా గ్రామపెద్దలు అభినందనలు తెలిపారు.