విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలి
ABN , First Publish Date - 2022-08-18T05:17:41+05:30 IST
విరివిగా మొక్కలునాటి వాతావరణ సమతుల్యంలో భాగస్వాములుకావాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు
అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్
భువనగిరి రూరల్, ఆగస్టు 17: విరివిగా మొక్కలునాటి వాతావరణ సమతుల్యంలో భాగస్వాములుకావాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవా రం ఆయన హైదరాబాద్లోని అరణ్య భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటవీ సంపదను 33శాతం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందన్నారు. ఇందుకుగా ను రాష్ట్రవ్యాప్తంగా 230కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్ధేశించుకున్నామన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మొక్కలు నాటాలన్నారు. కలెక్టర్ పమేలాసత్పథి మాట్లాడుతూ ఈ నెల 21న జిల్లాలో 2లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఈఎస్ నవీన్కుమార్, డీపీవో ఆర్.సునంద, అదనపు పీడీ టి.నాగిరెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మీ పాల్గొన్నారు.