రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం
ABN , First Publish Date - 2022-08-20T06:25:24+05:30 IST
మునుగోడు నియోజకవర్గంలో రానున్న ఉప ఎ న్నికలో బీజేపీ గెలుపు ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు అన్నారు.
చండూరురూరల్, ఆగస్టు 19: మునుగోడు నియోజకవర్గంలో రానున్న ఉప ఎ న్నికలో బీజేపీ గెలుపు ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు అన్నారు. శు క్రవారం చండూరు మండలం గట్టుప్పల గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కా ర్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబపాలనకు అంతిమఘడియలు మొదలయ్యాయని, ప్రజల్లో టీఆర్ఎ్సపై నమ్మకం పో యిందన్నారు. రానున్న ఉపఎన్నికలో బీజేపీ అధిక మెజారిటీతో గెలిచి కేసీఆర్ పతనానికి నాంది పలుకుతామని సూచించారు. ఈ నెల 21వ తేదీన మునుగోడులో జరిగే బీజేపీ భారీ బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, బీజీపీ జిల్లా నాయకులు కోమటి వీరేశం, మండల నాయకులు లింగస్వామిగౌడ్, పల్లె వెంకన్న తదితరులు పాల్గొన్నారు.