రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోవాలి
ABN , First Publish Date - 2022-07-24T05:45:01+05:30 IST
నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన రైతులు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి డి.రామారావు నాయక్ అన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి రామారావు
పెన్పహాడ్, గరిడేపల్లి, జూలై 23: నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన రైతులు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి డి.రామారావు నాయక్ అన్నారు. శనివారం గరిడేపల్లి మండలం పొనుగోడు, పెన్పహాడ్ మండలం దూపహాడ్ గ్రామంలోని రైతు వేదికలో రైతు దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా భూములను రిజిస్టర్ చేసుకున్న రైతులు, గతంలో రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీమా ఉంటే అకాల మృతి చెందితే రూ.5లక్షల బీమా వస్తుందన్నారు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలలోపు రైతులు ఈ బీమాకు అర్హులన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కృష్ణ సందీప్, ఏఈవో గోపి, రైతులు పాల్గొన్నారు.