బ్యాంక్ మేనేజర్పై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-01-29T05:42:07+05:30 IST
రుణాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న బ్యాంక్ మేనేజర్పై చర్యలు తీసుకోవాలని మాలిపురం గ్రామ విజయలక్ష్మీ సమభావన సంఘం సభ్యులు డిమాండ్ చేశారు.
తిరుమలగిరి, జనవరి 28 : రుణాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న బ్యాంక్ మేనేజర్పై చర్యలు తీసుకోవాలని మాలిపురం గ్రామ విజయలక్ష్మీ సమభావన సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఎస్బీఐ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంక్ ద్వారా ఇరవై ఏళ్లుగా సమభావన సంఘం ద్వారా రుణాలు తీసుకుని చెల్లిస్తున్నామన్నారు. సంఘంలో ఇద్దరు మహిళలు చనిపోవడంతో బకాయి పడిందన్నారు. ఆ ఇద్దరి డబ్బులను కూడా అందరూ కలిసి తీర్చామన్నారు. అయినా కూడా బ్యాంక్ మేనేజర్ కొత్త రుణం మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని వాపోయారు. న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించమని బ్యాంక్ ఎదుట కూర్చోవడంతో పోలీసులు వారితో చర్చించారు. బ్యాంక్ మేనేజర్ మహిళలకు క్షమాపణ చెప్పి రుణాలు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.