10క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-07-01T06:35:04+05:30 IST

అక్రమంగా నిల్వ ఉంచిన 10క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం గరిడేపల్లి మండలం లుంబతండా గ్రామానికి చెందిన గూగులోతు బాలు, పవన్‌ పాలకవీడు మండలం అలంగాపరం గ్రామంలో ఇంటింటికీ తిరిగి రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి లుంబ తండా గ్రామ శివారులోని ఓ ఇంటిలో నిల్వ ఉంచారు.

10క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

పాలకవీడు, జూన్‌ 30: అక్రమంగా నిల్వ ఉంచిన 10క్వింటాళ్ల  పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం గరిడేపల్లి మండలం లుంబతండా గ్రామానికి చెందిన గూగులోతు బాలు, పవన్‌ పాలకవీడు మండలం అలంగాపరం గ్రామంలో ఇంటింటికీ తిరిగి రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి లుంబ తండా గ్రామ శివారులోని ఓ ఇంటిలో నిల్వ ఉంచారు. విశ్వసనీయమైన సమాచారంతో రేషన్‌ బియ్యాన్ని నిల్వ ఉంచిన ఇంటిపై పోలీసులు దాడి చేసి 10క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసు సిబ్బందితో కలసి రైడ్‌  నిర్వహించి నిల్వ ఉంచిన 10 క్వింటాల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇరువురి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

ర్మర్‌

Updated Date - 2022-07-01T06:35:04+05:30 IST