బైక్‌ను ఇసుక టిప్పర్‌ ఢీకొని బాలుడి మృతి

ABN , First Publish Date - 2022-05-24T05:46:19+05:30 IST

బైక్‌ను ఇసుకటిప్పర్‌ ఢీకొన్న ఘటనలో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నాగాపూర్‌ గేట్‌ సమీపంలో సోమవారం రాత్రి జరిగింది.

బైక్‌ను ఇసుక టిప్పర్‌ ఢీకొని బాలుడి మృతి

హవేళిఘణపూర్‌, మే 23: బైక్‌ను ఇసుకటిప్పర్‌ ఢీకొన్న ఘటనలో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నాగాపూర్‌ గేట్‌ సమీపంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన కొండనొల్ల కుమార్‌(17), అరుణ్‌ బైక్‌ పై వెళ్లి హవేళిఘణపూర్‌లోని పెట్రోల్‌ బంక్‌లో  పెట్రోల్‌ పోయించుకుని కొండాపూర్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న ఇసుక టిప్పర్‌ వారి బైక్‌ను ఢీకొట్టడంతో కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి.  క్షతగాత్రులను 108 వాహనంలో మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయినట్లు తెలిపారు. కాగా ఇసుకటిప్పర్‌ ఈ ఘటనకు ముందు   గాజిరెడ్డిపల్లికి చెందినవారి బైక్‌ను ఢీకొట్టగా వారు ముళ్లపొదలో పడటంతో  వారిని తప్పించే యత్నంలో కుమార్‌ బైక్‌ను ఢీకొన్నట్టు పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు మురళి తెలిపారు.  

Updated Date - 2022-05-24T05:46:19+05:30 IST