ఘణపురం ఆనకట్టకు చేరిన సింగూర్ నీరు
ABN , First Publish Date - 2022-04-11T05:27:27+05:30 IST
రెండురోజుల క్రితం సింగూర్ నుంచి వదిలిన 0.35 టీఎంసీ నీరు ఆదివారం ఘణపురం ఆనకట్టకు చేరున్నది.
పాపన్నపేట, ఏప్రిల్ 10 : రెండురోజుల క్రితం సింగూర్ నుంచి వదిలిన 0.35 టీఎంసీ నీరు ఆదివారం ఘణపురం ఆనకట్టకు చేరున్నది. ఆ నీటిని ఫతేనహేర్, మహబూబ్నహేర్ అయిన ఆనకట్ట కుడి, ఎడమ కాలువలకు, పంట పొలాలకు సంబంధిత అధికారులు వదిలిపెట్టారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.