అధిక సాంద్రత పత్తి సాగును పరిశీలించిన శాస్త్రవేత్తలు
ABN , First Publish Date - 2022-11-18T23:59:49+05:30 IST
అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం వలన దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం తెలియజేశారు.
జగదేవ్పూర్, నవంబరు 18: అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం వలన దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం తెలియజేశారు. మర్కుక్, నరసన్నపేట, ఎర్రవల్లిలో ఈ పద్ధతి ద్వారా సాగు చేసే పొలాలను సందర్శించి పరిశీలించారు. పత్తి శాస్త్రవేత్త డా.తిరుమలరావు మాట్లాడుతూ ఈ పద్ధతిలోని వంగడాలు పంట కాలం తక్కువగా ఉండటం వల్ల తొందరగా పూత, కాయలు 20 నుంచి 30 వరకు వస్తున్నాయని వివరించారు. మొక్కలు ఏపుగా పెరగకుండా మేపిక్వాట్ క్లోరైడ్ అనే మందును పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఎకరాకు 25-30 కేజీల యూరియా 15 కిలోల పొటాష్ ఎరువులను వేసుకోవాలన్నారు. వారి వెంట డా.రాంప్రసాద్, ప్రశాంత్, మండల వ్యవసాయ అధికారి టి.నాగేందర్ రెడ్డి, రైతు గణేష్ తదితరులున్నారు.