రూ. 3లక్షల విలువైన గుట్కా పట్టివేత
ABN , First Publish Date - 2022-01-23T04:35:17+05:30 IST
మొగుడంపల్లి మండలంలోని చిరాగ్పల్లి పోలీ్సస్టేషన్ పరిధిలో 65వ జాతీయ రహదారిపై పోలీసులు రూ. 3లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
జహీరాబాద్ జనవరి 22: మొగుడంపల్లి మండలంలోని చిరాగ్పల్లి పోలీ్సస్టేషన్ పరిధిలో 65వ జాతీయ రహదారిపై పోలీసులు రూ. 3లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. చిరాగ్పల్లి పోలీ్సస్టేషన్ ఎస్ఐ కాశినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీ సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలోని బాల్కి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న అశోక్ లీల్యాండ్ వాహనాన్ని తనిఖీ చేసి అందులో గుట్కా ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించారు. ఆ వాహనంలో 42పెద్ద బ్యాగుల్లో ఉన్న గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు. సరుకు విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని వివరించారు. డ్రైవర్ పైజల్, అతడి యజమాని ఉస్మాన్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ చెప్పారు.