రోడ్డు ప్రమాదంలో మున్సిపాలిటీ ఉద్యోగి మృతి
ABN , First Publish Date - 2022-01-24T03:43:08+05:30 IST
చౌటకూర్ మండలం శివంపేట గ్రామ శివారులో సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
పుల్కల్, జనవరి 23 : చౌటకూర్ మండలం శివంపేట గ్రామ శివారులో సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని సరా్ఫపల్లి గ్రామానికి చెందిన మన్నె అర్జున్ (38) జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున స్వగ్రామం నుంచి తన బైక్పై విధులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో శివంపేట గ్రామ శివారులో జాతీయ రహదారిపై డివైడర్ను బైక్తో ఢీకొనగా అర్జున్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య దుర్గమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.