Medak: ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయంలో హుండీ చోరీ
ABN , First Publish Date - 2022-01-20T15:28:07+05:30 IST
జిల్లాలోని పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు.
మెదక్: జిల్లాలోని పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు. ఆలయంలోని హుండీని దుండగులు అపహరించారు. సుమారు రూ.లక్ష వరకు నగదు చోరీకి గురైంది. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డీఎస్పీ సైదులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.