మండల సాధన కోసం ట్యాంక్బండ్ పై దీక్ష
ABN , First Publish Date - 2022-08-17T05:13:18+05:30 IST
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సాధనసమితి సభ్యులు హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై దీక్ష చేపట్టారు.
కంగ్టి, ఆగస్టు 16: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సాధనసమితి సభ్యులు హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై దీక్ష చేపట్టారు. మండలం కోసం గ్రామంలో చేపడుతున్న దీక్ష 24వ రోజుకు చేరింది. ప్రభుత్వం నుంచి స్పందన లేక పోవడంతో ట్యాంక్ బండ్పై గల పింగళి వెంకయ్య విగ్రహం వద్ద బైఠాయించి దీక్ష చేపట్టారు. వారికి మాజీ ఎమ్మెల్యే రాములునాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హన్మంత్రావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో రాజ్కుమార్, మనోహర్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.