ఐసీడీఎస్‌ సీడీపీవోపై సభ్యుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-09-22T05:17:11+05:30 IST

గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు పౌష్టికాహారం, కోడిగుడ్లు సక్రమంగా అందించడం లేదని ఐసీడీఎస్‌ సీడీపీవో జయపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐసీడీఎస్‌ సీడీపీవోపై సభ్యుల ఆగ్రహం

అక్కన్నపేట, సెప్టెంబరు 21: గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు పౌష్టికాహారం, కోడిగుడ్లు సక్రమంగా అందించడం లేదని ఐసీడీఎస్‌ సీడీపీవో జయపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అక్కన్నపేటలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ మాలోతు లక్ష్మీబీలునాయక్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. మండలంలోని వివిధ గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం, గుడ్లు స్థానికంగా పంపిణీ చేయడం లేదని, మీరు కేంద్రాలను ఎందుకు సందర్శించడం లేదని సభ్యులు మండిపడ్డారు. ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు గ్రామపంచాయతీకి సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సర్పంచ్‌ గద్దల రమేష్‌ సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో మార్కెట్‌ చైర్మన్‌ అశోక్‌బాబు, ఎంపీడీవో కోప్పుల సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ సంజీవ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-22T05:17:11+05:30 IST