Hullchal of thieves.. మెదక్: నేషనల్ హైవే 44పై దొంగల హల్చల్
ABN , First Publish Date - 2022-08-18T17:04:00+05:30 IST
తూప్రాన్ దగ్గర నేషనల్ హైవే (National Highway) 44పై ముగ్గురు దొంగలు (thieves) హల్చల్ చేశారు.
మెదక్ (Medak) జిల్లా: తూప్రాన్ దగ్గర నేషనల్ హైవే (National Highway) 44పై ముగ్గురు దొంగలు (thieves) హల్చల్ చేశారు. జాతీయ రహదారిపై వస్తున్న లారీల డ్రైవర్లపై కత్తులతో దాడి చేశారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీలను బైపాస్ కరీంగూడ చౌరస్తా వద్ద టీ తాగేందుకు డ్రైవర్లు నిలిపారు. ఆ సమయంలో దుండగులు చోరీలకు పాల్పడుతున్నట్లు గమనించి అక్కడికి వచ్చారు. ఒక్కసారిగా డ్రైవర్లు అజారుద్దీన్, హైమద్ ఖాన్, నోమల్ ఖాన్లపై దుండగులు కత్తులతో దాడి చేసి పరార్ అయ్యారు. ఈ ఘటనపై లారీల డ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.