నిధులు మంజూరైనా రోడ్డు మరమ్మతులు చేపట్టరా?
ABN , First Publish Date - 2022-06-27T05:23:09+05:30 IST
రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరై నాలుగు నెలలు గడుస్తున్నా రోడ్డు పనులకు మోక్షం కలగడం లేదు.
చిన్నశంకరంపేట, జూన్ 26: రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరై నాలుగు నెలలు గడుస్తున్నా రోడ్డు పనులకు మోక్షం కలగడం లేదు. మండల కేంద్రం నుంచి జంగరాయి గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది. 11 ఏళ్ల క్రితం వేసిన రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ధ్వంసమైంది. దీంతో రోడ్డు పొడుగునా ఏర్పడిన గుంతల్లో పడి పలువురు వాహనదారులకు గాయాలయ్యాయి. కాగా నాలుగు నెలల క్రితం రోడ్డు మరమ్మతులు చేపట్టేందుకు రూ.95 లక్షలు నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించడం లేదు. వర్షాకాలం కావడంతో గుంతల్లో నీరు నిలిచి వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇకనైనా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి రోడ్డు మరమ్మతులను చేపట్టేందుకు కృషి చేయాలని జంగరాయి, చందాపూర్, మల్లుపల్లి గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.