కులవృత్తులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం: జడ్పీటీసీ

ABN , First Publish Date - 2022-10-12T04:33:45+05:30 IST

కులవృత్తులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని వర్గల్‌ జడ్పీటీసీ బాలుయాదవ్‌ అన్నారు.

కులవృత్తులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం: జడ్పీటీసీ

వర్గల్‌, అక్టోబరు 11: కులవృత్తులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని వర్గల్‌ జడ్పీటీసీ బాలుయాదవ్‌ అన్నారు. మంగళవారం నాచారం నాచగిరి లక్ష్మీనృసింహాస్వామి క్షేత్రంలోని హల్డీ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలి మాట్లాడారు. చెరువులు, కుంటల్లో గంగపుత్రులతో పాటు ముదిరాజ్‌లకు ప్రభుత్వం పూర్తి హక్కులు కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు జాలిగామ వెంకటేశ్‌ గౌడ్‌, నాచారం మాజీ సర్పంచ్‌ యాదగిరిగౌడ్‌, నాయకులు మురళీగౌడ్‌, కుమార్‌, అంజనేయులు పాల్గొన్నారు. 

చేపల పెంపకంతో ముదిరాజ్‌ల ఆర్థికాభివృద్ధి

కొండపాక, అక్టోబరు 11: చేపల పెంపకంతో ముదిరాజ్‌లు ఆర్థికాభివృద్ధి సాధిస్తారని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేవి రవీందర్‌ అన్నారు. మంగళవారం కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి, లకుడారం గ్రామల్లో ముదిరాజ్‌ కులస్తులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలను చెరువులో వదిలి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్‌ మల్లమారి రవీందర్‌, లకుడారం సర్పంచ్‌ కందూరి కనకవ్వ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-12T04:33:45+05:30 IST