రాజా రామ్మోహన్‌ రాయ్‌ బాటలో నడవాలి

ABN , First Publish Date - 2022-08-18T05:30:00+05:30 IST

మహిళల సాధికారత కోసం కృషిచేసిన రాజా రామ్మోహన్‌ రాయ్‌ బాటలో ప్రతిఒక్కరూ నడవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ మంజూశ్రీ అన్నారు.

రాజా రామ్మోహన్‌ రాయ్‌ బాటలో నడవాలి

సంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ మంజూశ్రీ

సంగారెడ్డి టౌన్‌, ఆగస్టు 18: మహిళల సాధికారత కోసం కృషిచేసిన రాజా రామ్మోహన్‌ రాయ్‌ బాటలో ప్రతిఒక్కరూ నడవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ మంజూశ్రీ అన్నారు. సంగారెడ్డిలోని జిల్లా గ్రంథాలయంలో గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నరహరిరెడ్డి ఆధ్వర్యంలో రామ్మోహన్‌ రాయ్‌ 250వ జయంతి నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఆయా విద్యాసంస్థలకు చెందిన వందలాది మంది విద్యార్థులు నిర్వహించిన భారీ ర్యాలీని జడ్పీ చైర్‌పర్సన్‌ మంజూశ్రీ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజయలక్ష్మి జాతీయ జెండాలు ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వసుంధర, జడ్పీటీసీ సునీతామనోహర్‌గౌడ్‌, తారా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రవీణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T05:30:00+05:30 IST