విద్యుదాఘాతంతో రైతు మృతి
ABN , First Publish Date - 2022-05-25T05:56:23+05:30 IST
మండలంలోని అచ్చన్నపల్లి గ్రామశివారులో ఓ రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
టేక్మాల్, మే 24: మండలంలోని అచ్చన్నపల్లి గ్రామశివారులో ఓ రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చెంద్రు తండాకు చెందిన రైతు గోగ్లుత్ వసురాం(46) అచ్చన్నపల్లి గ్రామ శివారులో ఉన్న తన భూమిలో కూరగాయలను సాగు చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం అతడు కూరగాయలకు నీరు పెట్టేందుకు వెళ్లగా బోర్ పని చేయలేదు. దీంతో భార్య లక్ష్మితో కలిసి ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ వైర్ వేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్తీగ వసురాం ఎడమచేతికి తగలడంతో ట్రాన్స్ఫార్మర్ గద్దె పైనుంచి కింద పడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకున్నట్టు ఎస్ఐ లింగం వివరించారు.