పోచారం డ్యాం వద్ద పర్యాటకుల సందడి
ABN , First Publish Date - 2022-10-17T05:03:56+05:30 IST
మెదక్-కామారెడ్డి జిల్లాల సరిహద్దులో గల పోచారం డ్యాం వద్ద ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు సందడి చేశారు.
హవేళిఘణపూర్: మెదక్-కామారెడ్డి జిల్లాల సరిహద్దులో గల పోచారం డ్యాం వద్ద ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు సందడి చేశారు. వర్షాకాలం నుంచి ప్రాజెక్టు పొంగిపొర్లుతుంది. ప్రకృతి అందాన్ని చూసేందుకు హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. దీంతో డ్యాం పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.