సంక్షేమం కోసం పాటుపడే కేసీఆర్పై విమర్శలా?
ABN , First Publish Date - 2022-09-20T04:59:57+05:30 IST
పేదల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్న సీఎం కేసీఆర్పై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శించడం శోచనీయమని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
వట్పల్లి, సెప్టెంబరు 19: పేదల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్న సీఎం కేసీఆర్పై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శించడం శోచనీయమని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం వట్పల్లితో పాటు మండలంలోని పలు గ్రామాలో ఆసరా పింఛన్ ప్రొసీడింగ్ ప్రతులను, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి పాటు పడుతున్న సీఎం కేసీఆర్ను దేశం కోరుకుంటుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఒక్కటైనా దేశ ప్రధాని సొంత రాష్ట్రంలో ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. కార్యక్రమంలో వరం కమిటీ అధ్యక్షుడు వీరారెడ్డి, ఎంపీపీ కృష్ణవేణి, జడ్పీటీసీ అపర్ణ, సొసైటీ చైర్మెన్ వినోద్గౌడ్, రైతుబంధు మండలాధ్యక్షుడు అశోక్గౌడ్, వైస్ ఎంపీపీ నాగరాణి, భస్వరాజ్, టీఆర్ఎస్ మండల ప్రదాన కార్యదర్శి శివాజీరావు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.