చిట్కుల్లో ప్రారంభమైన చాముండేశ్వరీ ఆలయ వార్షికోత్సవాలు
ABN , First Publish Date - 2022-01-23T04:29:33+05:30 IST
దక్షిణ భారతదేశంలోనే రెండో అతిపెద్ద చాముండేశ్వరీ ఆలయంగా ప్రసిద్దిగాంచిన చిట్కుల్ చాముండేశ్వరీ ఆలయ 39వ వార్షికోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
చిల్పచెడ్, జనవరి 22: దక్షిణ భారతదేశంలోనే రెండో అతిపెద్ద చాముండేశ్వరీ ఆలయంగా ప్రసిద్దిగాంచిన చిట్కుల్ చాముండేశ్వరీ ఆలయ 39వ వార్షికోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం రద్దీతో కిటకిటలాడింది. మొదటిరోజు అమ్మవారికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, కుంకుమాభిషేకం తదితర కార్యక్రమాలను నిర్వహించారు.