దీక్షా శిబిరంలోనే భోగి పండుగ
ABN , First Publish Date - 2022-01-14T05:30:00+05:30 IST
కుటుంబసభ్యులందరూ కలిసి సంతోషంగా చేసుకోవాల్సిన భోగి పండుగను అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు శుక్రవారం దీక్షా శిబిరంలోనే జరుపుకున్నారు.
పిండివంటలు చేసి గౌరవెల్లి నిర్వాసితుల నిరసన
టెంటు ముందు ముగ్గులు వేసిన మహిళలు
అక్కన్నపేట, జనవరి 14: కుటుంబసభ్యులందరూ కలిసి సంతోషంగా చేసుకోవాల్సిన భోగి పండుగను అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు శుక్రవారం దీక్షా శిబిరంలోనే జరుపుకున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని 23 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. భోగి పండుగ రోజు టెంటు ముందు మహిళలు ముగ్గులు వేసి, శిబిరంలో పిండివంటలు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భూనిర్వాసితులు మాట్లాడుతూ ఇంటి వద్ద ఉండి పిల్లలతో జరుపుకోవాల్సిన పండుగను దీక్షా శిబిరంలోనే చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చావుకైనా సిద్ధం కానీ.. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగబోదని వారు స్పష్టం చేశారు.