అట్టహాసంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు
ABN , First Publish Date - 2022-05-25T05:55:03+05:30 IST
మండల పరిధిలోని మాద్వార్ తండాలో విశ్వపాలిని జ్వాలాముఖి భవానీమాత, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
నారాయణఖేడ్, మే 24: మండల పరిధిలోని మాద్వార్ తండాలో విశ్వపాలిని జ్వాలాముఖి భవానీమాత, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం గంగపూజ, ధ్వజారోహణం, యాగశాల ప్రవేశం, బోనాలతో విగ్రహాలను ప్రదర్శన గణపతి, గౌరీ, స్వాస్తి, పుణ్యాహవాచకం, అగ్నిస్థాపనం, హోమాలు, చండీపారాయణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర నాయకులు రమేష్ చౌహాన్, స్థానిక బాధ్యులు రాజునాయక్తో పాటు తండావాసులు పాల్గొన్నారు. కాగా ఖేడ్ పట్టణంలోని చారిత్రాత్మకమైన రామాలయంలో మంగళవారం నవమిని పురస్కరించుకొని సీతారామచందుల్రకు అభిషేకం, దాతల సహకారంతో మహాప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు.