సిద్దిపేట మెడికల్ కళాశాలలో పీజీ కోర్సుకు జాతీయ మెడికల్ కమిషన్ ఆమోదం
ABN , First Publish Date - 2022-07-07T05:38:10+05:30 IST
సిద్దిపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి పీజీ ఫార్మకాలజీ కోర్సులో 5 సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇచ్చింది. బుధవారం ఈ మేరకు లేఖను కళాశాలకు పంపింది. ప్రతీ విద్యా సంవత్సరానికి ఫార్మకాలజీకి 5 సీట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. సిద్దిపేటలోని మెడికల్ కళాశాలలో ప్రస్తుతం 450 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సు చదువుతున్నారు.
2022-23 విద్యా సంవత్సరానికి ఫార్మకాలజీలో ఐదు సీట్లు
సిద్దిపేట టౌన్, జూలై 6: సిద్దిపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి పీజీ ఫార్మకాలజీ కోర్సులో 5 సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇచ్చింది. బుధవారం ఈ మేరకు లేఖను కళాశాలకు పంపింది. ప్రతీ విద్యా సంవత్సరానికి ఫార్మకాలజీకి 5 సీట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. సిద్దిపేటలోని మెడికల్ కళాశాలలో ప్రస్తుతం 450 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సు చదువుతున్నారు.