రెండో రోజు 207 మంది గైర్హాజరు

ABN , First Publish Date - 2022-05-25T05:10:18+05:30 IST

పదో తరగతి పరీక్షల్లో భాగంగా రెండో రోజు ద్వితీయ భాష పరీక్ష మంగళవారం ప్రశాంతంగా జరిగింది.

రెండో రోజు 207 మంది గైర్హాజరు

సంగారెడ్డి అర్బన్‌, మే 24: పదో తరగతి పరీక్షల్లో భాగంగా రెండో రోజు ద్వితీయ భాష పరీక్ష మంగళవారం ప్రశాంతంగా జరిగింది. 22,542 మంది విద్యార్థులకు 22,335 మంది హాజరుకాగా, 207 మంది గైర్హాజరయ్యారు. 99.08 శాతం హాజరు నమోదైనదని డీఈవో నాంపల్లి రాజేశ్‌ తెలిపారు. జిల్లాలోని పటాన్‌చెరు, కర్దనూర్‌, ఇస్నాపూర్‌ ప్రాంతాల్లోని ఏడు పరీక్షా కేంద్రాలను తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ జాయింట్‌ డైరెక్టర్‌, జిల్లా పరిశీలకులు సోమిరెడ్డి తనిఖీ చేశారు. అదే విధంగా ఝరాసంగం, రాయికోడ్‌, పెద్దచల్మెడ, కంకోల్‌, బుధేర, మునిపల్లి ప్రాంతాల్లోని ఏడు పరీక్షా కేంద్రాలను డీఈవో నాంపల్లి రాజేశ్‌ తనిఖీ చేశారు. 

Updated Date - 2022-05-25T05:10:18+05:30 IST