వ్యక్తిపై దాడి ఘటనలో 11 మంది నిందితుల అరెస్ట్
ABN , First Publish Date - 2022-07-06T05:09:56+05:30 IST
మండలంలోని చీలమామిడి గ్రామంలో సోమవారం ఉదయం బేగరి నరేష్ అనే వ్యక్తిని కులం పేరుతో దూషించి, హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో అదే గ్రామానికి చెందిన 11 మంది వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఝరాసంగం, జూలై 5: మండలంలోని చీలమామిడి గ్రామంలో సోమవారం ఉదయం బేగరి నరేష్ అనే వ్యక్తిని కులం పేరుతో దూషించి, హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో అదే గ్రామానికి చెందిన 11 మంది వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జహీరాబాద్ డీఎస్పీ రఘు సమగ్ర విచారణ జరిపి మంగళవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డీఎస్పీ స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు తెలిపారు. నిందితులు గొల్ల శ్రీనివాస్, గొల్ల రవి, గోపాల్, శేఖర్, రాములు, సంగన్న, రాంచెందర్, నర్సింహులు, శంకర్, మంగమ్మ, జనాబాయిలను అరెస్ట్ చేశామన్నారు. వారిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించామని చెప్పారు. సమావేశంలో సీఐ భరత్ కుమార్, ఎస్ఐలు రాజేందర్ రెడ్డి, ఏడుకొండలు, సిబ్బంది ఉన్నారు.