యూనివర్సిటీ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి
ABN , First Publish Date - 2022-07-05T05:07:51+05:30 IST
రాష్ట్రంలో దశాబ్దలుగా పని చే స్తున్న అన్ని యూనిర్సిటీల అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని పాల మూరు యూనివర్సిటీ టీచింగ్ అసోసియేషన్ (పుటా) అధ్యక్షుడు డాక్టర్ భూమయ్య డిమాండ్ చేశారు.
- పుటా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ భూమయ్య
- పీయూ పరిపాలన భవనం ఎదుట నిరసన
పాలమూరు యూనివర్సిటీ, జూలై4: రాష్ట్రంలో దశాబ్దలుగా పని చే స్తున్న అన్ని యూనిర్సిటీల అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని పాల మూరు యూనివర్సిటీ టీచింగ్ అసోసియేషన్ (పుటా) అధ్యక్షుడు డాక్టర్ భూమయ్య డిమాండ్ చేశారు. సోమవారం పీయూ పరిపాలన భవనం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వం ఏలాంటి ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయకుండా అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకు లు రవికుమార్, రంగప్ప, విజయ్ భాస్కర్, మృదుల, సుజాత పాల్గొన్నారు.