సోనియా గాంధీ దయతోనే తెలంగాణ
ABN , First Publish Date - 2022-12-09T23:48:51+05:30 IST
సోనియాగాంధీ దయతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని కాంగ్రెస్ నాయకులు అన్నారు.
- ఘనంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
మహబూబ్నగర్/ జడ్చర్ల/ భూత్పూర్/ దేవరకద్ర/ నవాబ్పేట, డిసెంబరు 9 : సోనియాగాంధీ దయతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఆమె పెట్టిన భిక్షతోనే టీఆర్ఎస్ నాయకులు పదవులు అనుభవిస్తూ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిం చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను, ఆత్మబలిదానాలను గుర్తించిన సోనియా కాంగ్రెస్కు నష్టం జరిగినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. శుక్రవారం సోనియాగాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకు న్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ సోనియాగాంధీ జన్మదిన వేడుకలు జరిపారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక నాయకులు పాల్గొన్నారు. రానున్న రోజు ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. మహబూబ్న గర్లో యువ జన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తాలో సోనియా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రకుమార్ గౌడ్, సంజీవ్ ముదిరాజ్, వినోద్కుమార్, సిజె బెనహర్, జహీర్ అక్తర్, లక్ష్మణ్ యాదవ్, సిరా జ్ఖాద్రి, రాఘవేందర్రాజు, చంద్రశేఖర్, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్, అజ్మత్అలీ, నాగిరెడ్డి, అవేజ్, రాములుయాదవ్ పాల్గొన్నారు
- జడ్చర్ల పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద సోనియాగాంధీ జన్మదినం వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కేకు కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు తినిపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ల వెంకటయ్య, బుక్క వెంకటేశ్, మినాజ్, కరాటే శ్రీను, కృష్ణ, సర్ఫరాజ్, అలీమొద్దీన్, యాదయ్య, కృష్ణయ్య, ఆనంద్, శేఖర్, రాఘవేందర్, నక్కా రాఘవేందర్ పాల్గొన్నారు.
- భూత్పూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటనర్సిం హారెడ్డి ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటం ఏర్పాటు చేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు గోవర్ధన్గౌడ్, మాజీ సర్పంచ్ హర్యా నాయక్, ఎండీ.ఫసియోద్దీన్, లిక్కి విజయ్గౌడ్, యాదయ్య, రవి, రాజు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
- దేవరకద్రలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరి కొండ ప్రశాంత్రెడ్డి ఆధ్వ ర్యంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కేక్కట్ చేసి ప్రభు త్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నాయకులు పాల్గొన్నారు.
- నవాబ్పేట అంబేడ్కర్ చౌరస్తాలో డీసీసీ ప్రధాన కార్యదర్శి బంగ్లరవి ఆధ్వర్యంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంపిటీసీ రామచంద్ర య్య, నీల్యనాయక్, రాజేష్, షబ్బీర్, మైనుద్దీన్, శ్రీహరి, శ్రీను, రాములు, ఆశన్న, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.