సోనియా ఆశీస్సులతోనే తెలంగాణ రాష్ట్రం

ABN , First Publish Date - 2022-12-09T23:17:14+05:30 IST

సోనియాగాంధీ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అన్నారు.

సోనియా ఆశీస్సులతోనే తెలంగాణ రాష్ట్రం
శాంతినగర్‌లోని తన నివాసంలో కేక్‌ కట్‌ చేస్తున్న ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌

- ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌

- ఘనంగా కాంగ్రెస్‌ అధినేత్రి జన్మదినం

వడ్డేపల్లి, డిసెంబరు 9: సోనియాగాంధీ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అన్నారు. కొందరు నాయకులు తమ పాదయాత్రలు, దీక్షలతోనే రాష్ట్రం ఏర్పడిందన్న భ్ర మలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధినేత సోనియాగాంధీ జన్మదినాన్ని శుక్రవారం శాంతినగర్‌లోని ఏఐసీసీ కార్యదర్శి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సంపత్‌కుమార్‌ కేక్‌ కట్‌ చేసి తమ నాయకు రాలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచినా అభి వృద్ధి శూన్యమన్నారు. కొందరు నాయకులు పథకాల పేరుతో పర్సెంటేజీలను దండుకుంటున్నారని ఆరోపిం చారు. తమ నాయకుడు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో ప్రజలు తమ సమస్యలను ఎకరవు పెట్టారన్నారు. ఈ యాత్ర నాయకులు, కార్యకర్తలకు కొ త్త ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఇప్పటికే నియోజకవర్గం లో పాదయాత్ర చేపట్టి అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకున్నానని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్య లను తెలుసుకుని పార్టీని మరింత బలోపేతం చేసేం దుకు కార్యకర్తలు కృషి చేస్తున్నారన్నారు. రాబోయే అసెం బ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. విద్య, వైద్య రంగాల్లో రాష్ట్రం ఎంతో వెనుకబాటుకు గురైందని, పాఠశాలల్లో మౌలిక వసతులులేక, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బం గారు రామకృష్ణారెడ్డి, అలంపూర్‌ మండల అధ్యక్షుడు అడ్డాకుల రాము, కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి దేవేందర్‌, నా యకులు భార్గవ్‌యాదవ్‌, వేముల శ్యామ్‌, పచ్చర్ల కుమార్‌, పైపాడు మాజీ ఎంపీటీసీ ఏసన్న, ఎర్రన్న పాల్గొన్నారు.

రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ

గద్వాల క్రైం : సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్‌ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సం పత్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినది సోనియాగాంధీ అన్న విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తుంచుకో వాలన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకుడు బల్గెర నారాయణ రెడ్డి, మాజీ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ శంకర్‌, నాయకులు షేక్‌ జమాల్‌, నందు, రాజేంద్ర, లాల్‌గౌడు, అలెగ్జాండర్‌, విజయ్‌కుమార్‌, శాషా పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:17:15+05:30 IST