ఆరోగ్యవంతమైన సమాజానికి సురక్షిత ఆహారమే ప్రధానం
ABN , First Publish Date - 2022-10-15T04:53:12+05:30 IST
ఆరోగ్య వం తమైన సమాజానికి సురక్షిత ఆహారమే ప్రధానమ ని అదనపు కలెక్టర్ పద్మజా రాణి అన్నారు.
- అదనపు కలెక్టర్ పద్మజా రాణి
నారాయణపేట టౌన్, అక్టోబరు 14: ఆరోగ్య వం తమైన సమాజానికి సురక్షిత ఆహారమే ప్రధానమ ని అదనపు కలెక్టర్ పద్మజా రాణి అన్నారు. శుక్రవా రం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రపంచ ఆహార దినో త్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘ఆకలితో ఉన్నవారికి ముందు అన్నం పెట్టు’ అన్న స్వామి వివేకానంద మాటలను గుర్తు చేశారు. అక్టోబరు 16న ఐరాసా ఫుడ్ అండ్ అగ్రిక ల్చర్ ఆర్గనైజేషన్ను స్థాపించిందని ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్ణయించారన్నారు. తొలి ఆహార దినోత్సవ నాడు ఆహారానికి ప్రాధాన్యం ఉందని ఆహార భద్రత అన్న దానిని తీసుకోవాలని అన్నారు. ఆకలిపై సమిష్టిపోరు జరపాలని పిలుపు నిచ్చారన్నారు. అనంతరం భోజనంచేసే విధానం త దితర అంశాలపై వివరంగా వివరించారు. సమావే శంలో డీఎస్వో శివప్రసాద్, హతిరాం, జాన్ సుధాకర్, వెంకటేశ్వర్లు, ఆర్డీవో రాంచందర్, చంద్రశేఖర్, డీలర్లు పాల్గొన్నారు.
వైష్ణవి దేవీ ఆలయంలో అదనపు కలెక్టర్ పూజలు
నారాయణపేట : నారాయణపేట అయ్యప్ప దే వాలయంలోని వైష్ణవిదేవి ఆలయంలో అదనపు కలె క్టర్ పద్మజా రాణి శుక్రవారం ప్రత్యేక పూజలు, అర్చ న నిర్వహించారు. ఈమె వెంట పుర వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, బస్సయ్య, అయ్యప్ప దేవాల య అధ్యక్షుడు మనోహర్ ప్రసాద్, సత్యనారాయణ, మల్లికార్జున్, బబాల్రాజ్, నాగేష్ పాల్గొన్నారు.