కళాకారులకు కొదవ లేదు
ABN , First Publish Date - 2022-08-17T04:36:26+05:30 IST
జిల్లాలో కవులు, కళాకారులకు కొదవలేదని జడ్పీ చైర్పర్సన్ స్వర్ణా సుధాకర్ రెడ్డి అన్నారు.

- జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణా సుధాకర్ రెడ్డి
మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 16 : జిల్లాలో కవులు, కళాకారులకు కొదవలేదని జడ్పీ చైర్పర్సన్ స్వర్ణా సుధాకర్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర భా రత వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో స్వతం త్ర స్ఫూర్తి వజ్రోత్సవ దీప్తి అనే అంశంపై నిర్వహించిన కవి సమ్మేళనానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇన్చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ కవులు తెలుగు భాష ద్వారా వారి భావాలను వ్యక్తి కరించేందుకు ఇది మంచి అవకాశమని అన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ కొడ్గల్ యాదయ్య, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు మాట్లాడారు. సమాచార శాఖ సహాయ సంచాలకులు యు. వెంకటేశ్వర్లు సమావేశానికి అధ్యక్షత వహించారు. జిల్లా హౌసింగ్ ఈఈ వైద్యం భాస్కర్, డీఎస్ఓ వనజాత, మైనారీటీ సంక్షేమ అధికారి శంకరాచారి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర, డీపీవో, సీపీవో, సోషల్ వెల్ఫేర్ డీడీలు పాల్గొన్నారు.