భారత్‌ జోడో యాత్రను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-10-19T04:12:34+05:30 IST

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో పాదయా త్రను విజయవంతం చేయాలని జడ్చర్ల మాజీ ఎ మ్మెల్యే మల్లురవి, ఎర్రశేఖర్‌ కోరారు.

భారత్‌ జోడో యాత్రను విజయవంతం చేయాలి
మాట్లాడుతున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే మల్లు రవి, ఎర్ర శేఖర్‌

మరికల్‌, అక్టోబరు 18 : ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో పాదయా త్రను విజయవంతం చేయాలని జడ్చర్ల మాజీ ఎ మ్మెల్యే మల్లురవి, ఎర్రశేఖర్‌ కోరారు. మంగళ వారం మరికల్‌లో ఇందిరా గాంధీ విగ్రహాన్ని వారు పరిశీలించి మాట్లాడారు. ఈనెల 23న ఉదయం ఏడు గంటలకే జిల్లాలో భారత్‌ జోడో పాదయాత్ర ప్రారంభ మౌతుందన్నారు. పాదయాత్రలో జిల్లా నుంచి లక్ష మంది ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొని రాహుల్‌ గాంధీకి స్వాగతం పల కాలని కోరారు. దీపావళి సందర్భంగా 27న పాద యాత్ర పునర్‌ ప్రారంభం అవుతుందన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి సొంత విమానం లేదు, 70 ఏళ్ల బీజేపీకి సొంత విమానం లేదని కేవలం 20 ఏళ్ల క్రితం స్థాపించిన టీఆర్‌ఎస్‌ వంద కోట్లతో విమానం కొనుగోలు చేయడం పట్ల ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలన్నారు.

Updated Date - 2022-10-19T04:12:34+05:30 IST