జోగుళాంబ సన్నిధిలో అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్
ABN , First Publish Date - 2022-08-07T05:04:52+05:30 IST
అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబదేవి, బా లబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శనివారం తెలంగాణ అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డొబ్రియల్ దర్శించుకున్నారు.
అలంపూరు, ఆగస్టు 6 : అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబదేవి, బా లబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శనివారం తెలంగాణ అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డొబ్రియల్ దర్శించుకున్నారు. అంతకుముందు వీరికి ఆలయ ప్రధాన అర్చ కుడు దిండిగల్ ఆనంద్శర్మ, సిబ్బంది సాదరస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు చేశారు. ద ర్శనం అనంతరం వారిని శేషవస్ర్తాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. వీరి వెంట కన్జర్వేటర్ మహబూబ్నగర్ సర్కిల్ క్షితీజా, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల అటవీశాఖ అధికారి రామకృష్ణ, గద్వాల ఫారెస్ట్ రేంజ్ అధికారి దేవరాజ్ ఉన్నారు.