ఘనంగా పీర్ల పండగ
ABN , First Publish Date - 2022-08-09T05:13:06+05:30 IST
మండల కేంద్రంలోని కోటవీధి, బస్టాండు, అచ్చుగట్లవీధి, చిన్నమజీద్ ప్రాంతాల్లో సోమవారం మొహర్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

పీర్లకు మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు
రాజోలి/ అలంపూర్, ఆగస్టు 8 : మండల కేంద్రంలోని కోటవీధి, బస్టాండు, అచ్చుగట్లవీధి, చిన్నమజీద్ ప్రాంతాల్లో సోమవారం మొహర్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నమజీద్లోని పీర్లకు చక్కెర, గంధం, కొబ్బరిగిన్నెలు, దట్టీలు, పూల దండలు సమర్పించి ప్రజలు మొక్కులు తీర్చుకున్నారు. సాంభ్రాణి ధూపంతో ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సవారి కార్యక్రమంలో భాగంగా సోమ వారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం గం. 8-00ల వరకు గ్రామంలోని ప్రధాన వీధుల్లో పీర్లను ఊరేగించి, మసీదుకు చేరుస్తారు. సాయంత్రం పీర్లను ఊరేగింపుగా తుంగభద్ర నదికి తీసుకెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలంపూరు పట్టణంలో సోమవారం అలేఅక్బర్ పీరు ఊరేగింపును ఘనంగా నిర్వహించారు.